Header Banner

తెలంగాణ సీఎం ఓఎస్డీని అంటూ బడా కంపెనీలకు బెదిరింపులు..! ఏపీకి చెందిన మాజీ క్రికెటర్ అరెస్టు!

  Thu May 22, 2025 19:41        Politics

ముఖ్యమంత్రి కార్యాలయంలోని కీలక అధికారి పేరు చెప్పి బెదిరింపులకు, వసూళ్లకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ రంజీ క్రికెటర్ బుడుమూరు నాగరాజును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగరాజు పలువురు వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

శ్రీకాకుళం జిల్లా, పొలాకి మండలం, యవ్వారిపేటకు చెందిన బుడుమూరు నాగరాజు, తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) అని పరిచయం చేసుకుంటూ పలు మోసాలకు ఒడిగట్టినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ప్రముఖ రవాణా సేవల సంస్థ ర్యాపిడో, పాల ఉత్పత్తుల సంస్థ కంట్రీ డిలైట్ మేనేజింగ్ డైరెక్టర్లకు ఫోన్లు చేసి, నాగరాజు డబ్బులు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు అందాయి. పలు రియల్ ఎస్టేట్ కంపెనీల ఛైర్మన్‌లకు కూడా సీఎం ఓఎస్డీ పేరుతో వాట్సాప్ ద్వారా సందేశాలు పంపి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ వ్యవహారంలో మరింత నమ్మకం కలిగించేందుకు, నాగరాజు ఏకంగా సీఎం ఓఎస్డీ పేరుతో ఒక నకిలీ ఈ-మెయిల్ ఐడీని కూడా సృష్టించినట్లు సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అందిన ఫిర్యాదుల ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు, పక్కా సమాచారంతో శ్రీకాకుళంలో నాగరాజును అరెస్టు చేశారు. అనంతరం అతడిని హైదరాబాద్‌కు తరలించి, కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు సైబర్ క్రైమ్ అధికారులు తెలియజేశారు.

బుడుమూరు నాగరాజుకు గతంలోనూ నేర చరిత్ర ఉంది. గతంలో అతడు కోడెల శివరాంపై కొన్ని తప్పుడు కేసులు పెట్టి, ఆ తర్వాత వాటిని వెనక్కి తీసుకున్న ఘటన చర్చనీయాంశమైంది. అంతేకాకుండా, 2023లో శ్రీకాకుళం ప్రాంతంలో సుమారు 22 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడిన కేసులోనూ నాగరాజు నిందితుడిగా ఉన్నాడు.

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!


హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం..! నకిలీ పత్రాలతో ఆధార్, పాన్!


ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!


ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!


టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!


అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!


పాఠశాలల్లో రోజూ ఒక గంట యోగా తప్పనిసరి! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!


విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! 160 మంది ప్రయాణికులతో..


అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!


ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #socialmedia #halchal #ap #excricketer #arrest